మన హిందూ సాంప్రదాయంలో నిత్య దీపారాధనకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీపం deeparadhana thappulu ఎక్కడ వెలిగితే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. అయితే, చాలామంది ఇళ్లలో ఉదయం, సాయంత్రం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ.. ఇంట్లో కలిసి రాకపోవడం, రోజురోజుకూ అప్పుల పాలు కావడం, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం జరుగుతుంటాయి.
దీనికి కారణం.. మనం పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే చేసే కొన్ని భయంకరమైన దీపారాధన తప్పులు! వాస్తు శాస్త్రం ప్రకారం, దీపం పెట్టే దిశ, వాడే వస్తువుల విషయంలో చిన్న పొరపాటు జరిగినా.. ఆ ఇల్లు లక్ష్మీదేవికి బదులు దరిద్రానికి నిలయంగా మారుతుంది. మరి కోటీశ్వరుడినైనా రోడ్డున పడేసే ఆ తీవ్రమైన తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. ఆ దిశగా దీపం పెడితే అకాల మృత్యువు, ధన నష్టం తప్పదు!
చాలామంది పూజా గదిలో స్థలం లేదనో లేదా అవగాహన లేకనో దీపపు కుందులను deeparadhana thappulu తమకు తోచిన దిశలో పెడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. దక్షిణ దిశను యమ స్థానంగా భావిస్తారు. పొరపాటున కూడా దీపం ముఖం దక్షిణం వైపు ఉండేలా వెలిగించకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి, ఊహించని ధన నష్టం సంభవిస్తుంది. అంతేకాదు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించి, అకాల మృత్యు భయాలు వెంటాడుతాయి. దీపం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల వైపు మాత్రమే ముఖం ఉంచి వెలిగించాలి.
2. ఏక ఒత్తి దీపం.. శ్మశానంతో సమానం!
హడావిడిగా పూజ ముగించాలనే నెపంతో కొంతమంది ప్రమిదలో కేవలం ఒకే ఒక ఒత్తిని deeparadhana thappulu వేసి దీపాన్ని వెలిగిస్తుంటారు. కానీ, శాస్త్ర నియమాల ప్రకారం.. ఒకే ఒత్తితో కూడిన దీపాన్ని అశుభ కార్యాల్లో లేదా శ్మశాన వాటికల్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇంట్లో శుభం కలగాలని పెట్టే దీపారాధనకు ఎల్లప్పుడూ రెండు ఒత్తులను కలిపి ఒకే ఒత్తిగా చేసి వెలిగించాలి. ఒకే ఒత్తితో దీపం పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని పురాణాలు చెబుతున్నాయి.

